Crime News:మేకలను దొంగలించిన పోలీసులు

కొత్త సంవత్సరం వేడుకల్లో విందు కోసమని పోలీసులు రెండు మేకలను దొంగలించారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా సింధికెల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకల మందలో

Published : 02 Jan 2022 06:55 IST

కటక్‌, న్యూస్‌టుడే: కొత్త సంవత్సరం వేడుకల్లో విందు కోసమని పోలీసులు రెండు మేకలను దొంగలించారు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా సింధికెల గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకల మందలో రెండు కనిపించకపోవడంతో పోలీసులే దొంగిలించారని తెలుసుకొని.. స్టేషన్‌ వెనుక వాటిని కోసేందుకు చూస్తుండగా వెళ్లి అడ్డుకున్నారు. అయినా.. పోలీసులు వినలేదు. దీంతో సంకీర్తనగురు గ్రామస్థులకు విషయం చెప్పి, ఫిర్యాదు చేసేందుకు మళ్లీ  స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు సంకీర్తనగురును బెదిరించారు. విషయం  ఎస్పీ నితిన్‌ శుక్లాకర్‌ దృష్టికి వెళ్లింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించి ఏఎస్‌ఐ సుమన్‌ మల్లిక్‌ను శనివారం సస్పెండు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని