Corona Virus: ఒకరి నుంచి నలుగురికి కరోనా వ్యాప్తి
దేశంలో ప్రస్తుతం ఒకరి నుంచి నలుగురికి కరోనా సోకుతున్నట్టు ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు వారు ఆర్-నాట్ (ఆర్జీరో) విలువను లెక్కించగా, 4గా నమోదైంది. తాజా డేటా ప్రకారం- ఫిబ్రవరి
లెక్కగట్టిన ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు
దేశంలో ప్రస్తుతం ఒకరి నుంచి నలుగురికి కరోనా సోకుతున్నట్టు ఐఐటీ-మద్రాస్ పరిశోధకులు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి తీవ్రతను అంచనా వేసేందుకు వారు ఆర్-నాట్ (ఆర్జీరో) విలువను లెక్కించగా, 4గా నమోదైంది. తాజా డేటా ప్రకారం- ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య దేశంలో అత్యంత ఉద్ధృతంగా కేసులు నమోదవుతాయని భావిస్తున్నట్టు గణిత విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జయంత్ ఝా పేర్కొన్నారు. ప్రజలు గుమిగూడకుండా కట్టడి చర్యలను కఠినతరం చేయడం, క్వారంటైన్ను పక్కాగా అమలుచేస్తే ఆర్-నాట్ విలువ తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్-నాట్ విలువ 2.69గా ఉన్నట్టు గతవారం లెక్కగట్టింది. రెండో దశ ఉద్ధృతిలో ఈ విలువ గరిష్ఠంగా 1.69గా నమోదైనట్టు తెలిపింది. కాగా- డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం 90-95% తక్కువగానే ఉంటోందని అమెరికాకు చెందిన ‘హెల్త్ మెట్రిక్ ఇన్స్టిట్యూట్’ డైరెక్టర్ డాక్టర్ క్రిస్టఫర్ ముర్రే అంచనా వేశారు. అయితే, భారత్లో ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నందున ఫిబ్రవరిలో రోజూ 5 లక్షల కేసులు నమోదయ్యే పరిస్థితి ఉండొచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..