TrainTickets: రైలు టికెట్లపై అభివృద్ధి పన్ను భారం
దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులపై అభివృద్ధి పన్ను భారం పడనుంది. రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్న రైల్వేస్టేషన్లకు ఈ పెంపు వర్తిస్తుంది. స్టేషన్ అభివృద్ధి రుసుం (స్టేషన్ డెవలప్మెంట్ ఫీ /ఎస్డీఎఫ్) పేరిట ప్రయాణికుల నుంచి టికెట్
దిల్లీ: దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులపై అభివృద్ధి పన్ను భారం పడనుంది. రైల్వేశాఖ పునరుద్ధరిస్తున్న రైల్వేస్టేషన్లకు ఈ పెంపు వర్తిస్తుంది. స్టేషన్ అభివృద్ధి రుసుం (స్టేషన్ డెవలప్మెంట్ ఫీ /ఎస్డీఎఫ్) పేరిట ప్రయాణికుల నుంచి టికెట్ స్థాయినిబట్టి రూ.10 నుంచి రూ.50 దాకా అదనంగా వసూలు చేయనున్నారు. రైల్వే టికెట్ల బుకింగు సమయంలోనే ఈ అదనపు మొత్తాన్ని కలుపుతారు. ఆయా స్టేషన్ల నవీకరణ పూర్తయ్యాకే ఈ వడ్డింపు ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ అదనపు రుసుం మూడు కేటగిరీలుగా ఉంటుంది. ఏసీ క్లాస్ ప్రయాణికులకు రూ.50, స్లీపర్ క్లాసుకు రూ.25, అన్ రిజర్వుడు క్లాసుకు రూ.10 వసూలు చేస్తారు. సబర్బన్ రైలు ప్రయాణాలకు ఈ అదనపు ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ మేరకు రైల్వేబోర్డు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!