Crime News: రుణం ఇవ్వలేదని బ్యాంకుకు నిప్పు.. ఎక్కడంటే!

తనకు రుణం మంజూరు చేయకపోవడంతో వసీం అక్రమ్‌ ముల్లా అనే వ్యక్తి బ్యాంకుకు నిప్పు పెట్టాడు. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated : 10 Jan 2022 16:18 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: తనకు రుణం మంజూరు చేయకపోవడంతో వసీం అక్రమ్‌ ముల్లా అనే వ్యక్తి బ్యాంకుకు నిప్పు పెట్టాడు. కర్ణాటకలోని హావేరి జిల్లా హెడిగొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. రట్టిహళ్లికి చెందిన నిందితుడు కెనరా బ్యాంకులో రుణం కోసం మేనేజరును సంప్రదించాడు. కావలసిన పత్రాలను అతను సమకూర్చలేకపోవడంతో రుణం రాదని మేనేజరు చెప్పారు. కోపం పెంచుకున్న అక్రమ్‌ ముల్లా బయటకు వెళ్లి పెట్రోలు క్యానుతో వచ్చాడు. పెట్రోలు చల్లి, నిప్పంటించి పరారవుతున్న అతడిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా, తన వద్ద ఉన్న కత్తితో బెదిరించాడు. చివరకు పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బ్యాంకులోని కంప్యూటర్లు, ఇతర ఉపకరణాలు, కొన్ని కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోయాయి. నగదు, నగలు భద్రంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక బ్యాంకు మాజీ అధికారి ఒకరు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని