జల్లికట్టులో ఎద్దు పొడిచి ఒకరి మృతి

తమిళనాడులోని మదురై జిల్లా అవనియాపురంలో శుక్రవారం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఏటా పొంగల్‌ పండగ రోజు ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం

Published : 15 Jan 2022 04:40 IST

ప్యారిస్‌ (చెన్నై), న్యూస్‌టుడే: తమిళనాడులోని మదురై జిల్లా అవనియాపురంలో శుక్రవారం జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఏటా పొంగల్‌ పండగ రోజు ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం పోటీలకు వచ్చిన ఓ ఎద్దు పొడిచి ఒకరు మృతి చెందారు. పోటీ జరిగే చోటు నుంచి ఎద్దులు బయటకు వెళ్లే ప్రాంతంలో నిలుచుని ఉన్న బాలమురుగన్‌ (18)ను ఎద్దు పొడవడంతో గుండె వద్ద గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఈ పోటీల్లో మరో 48 మందికి గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని