చక్రాలకుర్చీతో దివ్యాంగుడి రికార్డు

ఒడిశాలోని పూరీకి చెందిన దివ్యాంగుడు కమలాకాంత్‌ (27) ట్రై సైకిల్‌ నడపడంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. భువనేశ్వర్‌లో శనివారం నుంచి ఆదివారం

Published : 17 Jan 2022 04:43 IST

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని పూరీకి చెందిన దివ్యాంగుడు కమలాకాంత్‌ (27) ట్రై సైకిల్‌ నడపడంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. భువనేశ్వర్‌లో శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా 20 గంటలపాటు 183 కి.మీ సైకిల్‌ నడిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు సైకిల్‌ నడపడం ప్రారంభించి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ముగించారు. దీన్ని వీడియో తీసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు సంస్థకు పంపడంతో వారు పరిశీలించి ఆమోదించారని కమలాకాంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని