
గణతంత్ర వేడుకల్లో 75 విమానాలతో విన్యాసాలు
దిల్లీ: దేశ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు వాయుసేన ఏర్పాట్లు చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. 75 ఎయిర్క్రాఫ్ట్లతో విన్యాసాలు చేపట్టనున్నట్లు వాయుసేన ఉన్నతాధికారులు పేర్కొన్నారు. విన్యాసాల్లో రఫేల్, జాగ్వార్, మిగ్-29 యుద్ధ విమానాలు, చినూక్ హెలికాప్టర్లు పాల్గొంటాయని వాయుసేన అధికారులు తెలిపారు. ఎంఐ 17 హెలికాప్టర్ల ‘ధ్వజ్’ ఆకృతితో విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నాలుగు తేలికపాటి హెలికాప్టర్లతో ‘రుద్ర’, ఐదు హెలికాప్టర్లతో ‘రాహత్’ విన్యాసాలు ఉంటాయని ఓ అధికారి వెల్లడించారు. అదేవిధంగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు కూడా విన్యాసాల్లో పాలుపంచుకుంటాయన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.