‘సూపర్‌ మామ్‌’పులి మృతి

మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లో 29 పులిపిల్లలకు జన్మనిచ్చిన కాలర్‌ వాలీ అనే ఆడపులి మృతి చెందింది. పదిహేడేళ్ల వయసు కలిగిన ఈ పులి ‘సూపర్‌ మామ్‌’గా పేరుగాంచింది. ‘‘2008-2018 మధ్యకాలంలో

Published : 18 Jan 2022 05:20 IST

మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లో 29 పులిపిల్లలకు జన్మనిచ్చిన కాలర్‌ వాలీ అనే ఆడపులి మృతి చెందింది. పదిహేడేళ్ల వయసు కలిగిన ఈ పులి ‘సూపర్‌ మామ్‌’గా పేరుగాంచింది. ‘‘2008-2018 మధ్యకాలంలో 8 ప్రసవాల్లో 29 పిల్లలకు జన్మనిచ్చి రికార్డ్‌ నెలకొల్పింది. మొదటిసారి మూడు పిల్లలకు జన్మనివ్వగా అవి బతకలేదు. చివరిసారిగా 2018లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తంగా 29 పిల్లల్లో 25 బతికాయి. వృద్ధాప్యం కారణంగా ఈ పులి చనిపోయింది’’ అని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని