ఫూటుగా తాగాడు.. బిల్లు అడిగితే బొటన వేలు కొరికేశాడు..
బార్కు వెళ్లి ఫూటుగా తాగిన ఓ వ్యక్తి.. బిల్లు చెల్లింపు విషయంలో తలెత్తిన గొడవలో ఏకంగా బార్ యజమాని బొటన వేలినే కొరికేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో
ముజఫర్నగర్: బార్కు వెళ్లి ఫూటుగా తాగిన ఓ వ్యక్తి.. బిల్లు చెల్లింపు విషయంలో తలెత్తిన గొడవలో ఏకంగా బార్ యజమాని బొటన వేలినే కొరికేశాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనసత్ పట్టణంలోని బార్లో సునీల్కుమార్ అనే వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు. బిల్లు చెల్లించాల్సిందిగా బార్ యజమాని అశోక్కుమార్ కోరడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన సునీల్ అశోక్కుమార్ బొటన వేలిని కొరికాడు. ఈ ఘటనలో సునీల్తో పాటు అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.