కల్తీ మద్యం తాగి అయిదుగురి మృతి
హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో కల్తీ మద్యం తాగి అయిదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం కొంతమంది
హిమాచల్ప్రదేశ్లో ఘటన
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లోని మండీ జిల్లాలో కల్తీ మద్యం తాగి అయిదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం కొంతమంది వ్యక్తులు కాంగ్రాలోని ఓ కంపెనీ తయారు చేసిన ‘సంత్రా బ్రాండ్’ మద్యాన్ని తీసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ఇది తీసుకున్న వారిలో అయిదుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటనపై నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీఐజీ మధుసూదన్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.