24 గంటల్లో 3.47 లక్షల కేసులు

దేశంలో కొవిడ్‌ మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏకంగా 3,47,254 కొత్త కేసులు బయటపడగా.. 703 మరణాలు నమోదయ్యాయి. గత 235 రోజుల్లో

Published : 22 Jan 2022 05:18 IST

దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి రోజురోజుకీ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. గత 24 గంటల్లో ఏకంగా 3,47,254 కొత్త కేసులు బయటపడగా.. 703 మరణాలు నమోదయ్యాయి. గత 235 రోజుల్లో ఎన్నడూలేనంత గరిష్ఠంగా.. క్రియాశీలక కేసుల సంఖ్య 20,18,825 (5.23%)కి చేరింది. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 9,692కి పెరిగింది. మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 3,85,66,027కి చేరగా..  ఇంతవరకు 4,88,396 మంది ప్రాణాలు కోల్పోయారు.  రోజువారీ పాజిటివిటీ రేటు ఒక్కసారిగా 17.94%కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని