మోదీ నంబర్ 1
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈమేరకు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను
ప్రజాదరణలో అగ్రభాగాన ప్రధాని
అమెరికా అధ్యక్షుడు బైడెన్కు 6వ స్థానం
ప్రపంచ నేతలపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సర్వే
దిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న దేశాధినేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఈమేరకు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వివిధ దేశాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. సర్వే చేసిన 13 మంది ప్రముఖ నేతలకు గాను అత్యధికంగా 71% ప్రజాదరణతో భారత ప్రధాని మోదీ ప్రథమ స్థానంలో నిలిచారు. 43% ప్రజామోదంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కి ఈ జాబితాలో ఆరో స్థానం దక్కింది. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66% ప్రజాదరణతో రెండో స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాగీ 60%తో మూడో స్థానాన్ని సాధించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా (48%), జర్మనీ ఛాన్స్లర్ ఒలఫ్ స్కాల్జ్ (44%)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్లు 7, 8 స్థానాలను దక్కించుకున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ 26% ప్రజామోదంతో ఈ జాబితాలో చిట్టచివరి స్థానంలో నిలిచారు. జనవరి 13-19 మధ్య వారం పాటు ప్రతి దేశంలోనూ వయోజనుల నుంచి అభిప్రాయాలు సేకరించిన మార్నింగ్ కన్సల్ట్ తాజా రేటింగ్స్ను విడుదల చేసింది. ఈ సంస్థ 2020 మే నెలలో చేపట్టిన సర్వేలోనూ మోదీ 84% ప్రజాదరణతో అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది మే నెలలో కరోనా రెండో ఉద్ధృతి సమయంలో మాత్రం ఇది 63 శాతానికి తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్