Covid Vaccine: చనిపోయిన మహిళకు రెండో డోసు టీకా!

మూడు నెలల కిందట చనిపోయిన హేమలత అనే మహిళకు.. తాజాగా కరోనా టీకా రెండోడోసు ఇచ్చినట్లు బంధువుల మొబైల్‌ నంబరుకు సందేశం వచ్చింది. వైరల్‌గా మారిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబాలో జరిగింది.

Published : 23 Jan 2022 09:45 IST

మూడు నెలల కిందట చనిపోయిన హేమలత అనే మహిళకు.. తాజాగా కరోనా టీకా రెండోడోసు ఇచ్చినట్లు బంధువుల మొబైల్‌ నంబరుకు సందేశం వచ్చింది. వైరల్‌గా మారిన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహోబాలో జరిగింది. దీనిపై జిల్లా ప్రధాన వైద్యాధికారి డా.సుధాకర్‌ పాండే ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ విచారణకు ఆదేశించారు. వైద్యఆరోగ్య శాఖ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. హేమలత గత సెప్టెంబరు 21న కొవిడ్‌ కారణంగానే మరణించారు. ఇప్పుడు ఆమె కరోనా వ్యాక్సిను రెండోడోసు తీసుకున్నట్లు మృతురాలి మేనల్లుడు సౌరవ్‌ యాదవ్‌ సెల్‌ఫోనుకు సందేశం వచ్చింది. ఈ మెసేజ్‌ రాకమునుపు సౌరవ్‌కు టీకా పంపిణీకి సంబంధించి జనవరి 15న వెరిఫికేషన్‌ కాల్‌ కూడా వచ్చింది. ఆ సమయంలో అతను మేనత్త చనిపోయినట్లు సమాచారం కూడా ఇచ్చాడు. అయినా.. టీకా తీసుకున్నట్లు మెసేజి రావడం చూసి అందరూ అవాక్కవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని