ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్లో కొత్త సాంకేతికత
దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్బోర్డ్ ఛార్జర్ సాంకేతికత వ్యయాన్ని సగానికి పైగా తగ్గించనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలకూ కళ్లెం పడే అవకాశం ఉంది!.
అభివృద్ధి చేసిన ఐఐటీ పరిశోధకులు
భారీగా తగ్గనున్న ధరలు!
దిల్లీ: దేశంలోని వివిధ ఐఐటీలకు చెందిన పరిశోధకులు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఆన్బోర్డ్ ఛార్జర్ సాంకేతికత వ్యయాన్ని సగానికి పైగా తగ్గించనుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలకూ కళ్లెం పడే అవకాశం ఉంది!. ఈ సాంకేతికతను ఐఐటీ గువాహటి, ఐఐటీ భువనేశ్వర్లతో కలిసి వారణాసిలోని ఐఐటీ-బీహెచ్యూ పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దేశంలోని ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఈ సాంకేతికతపై ఆసక్తి చూపిందని, వాణిజ్యపరమైన ఉత్పత్తికీ సుముఖత వ్యక్తం చేసిందని బృందం సభ్యులు తెలిపారు. అయితే సంస్థ పేరును వీరు వెల్లడించలేదు. ‘‘దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంప్రదాయ ఐసీ ఇంజిన్లకు.. ఎలక్ట్రిక్ వాహనాలే సరైన ప్రత్యామ్నాయం. శక్తిమంతమైన ఆఫ్బోర్డ్ ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడంతో ఉత్పత్తిదారులు.. వాహనంలోనే ఆన్బోర్డ్ ఛార్జర్లు వాడుతున్నారు. దీనివల్ల తయారీ వ్యయం పెరుగుతోంది. మా ప్రతిపాదిత ఆన్బోర్డ్ ఛార్జర్ సాంకేతికతలో ప్రొపెల్షన్ మోడ్కు అవసరమైన అదనపు పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంటర్ఫేస్ను ఒక్క దాన్ని తగ్గిస్తున్నాం. దీంతో వాడాల్సిన పరికరాలు 50 శాతం తగ్గనున్నాయి. ప్రతిపాదిత సాంకేతికత.. ఛార్జింగ్ మోడ్లో ఛార్జర్గానూ. ప్రొపెల్షన్ మోడ్లో ఇన్వర్టర్గానూ పని చేస్తుంది’’ అని ఐఐటీ (బీహెచ్యూ) పరిశోధకుడు రాజీవ్ కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ