18 శాతమే ఉన్నారు
దేశంలోని మొత్తం ఐఏఎస్లలో కేంద్ర ప్రభుత్వానికి 40% మంది అవసరం ఉండగా ప్రస్తుతం 18% మాత్రమే అందుబాటులో ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. కేంద్ర సేవల కోసం మరింత మందిని
అందుకే అఖిల భారత సర్వీసు నిబంధనల్లో మార్పు: అపూర్వ చంద్ర
ఈనాడు, దిల్లీ: దేశంలోని మొత్తం ఐఏఎస్లలో కేంద్ర ప్రభుత్వానికి 40% మంది అవసరం ఉండగా ప్రస్తుతం 18% మాత్రమే అందుబాటులో ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార శాఖల కార్యదర్శి అపూర్వ చంద్ర పేర్కొన్నారు. కేంద్ర సేవల కోసం మరింత మందిని అందుబాటులోకి తేవడానికే అఖిల భారత సర్వీసు అధికారుల నిబంధనలను మార్చాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ‘‘డిప్యుటేషన్ మీదున్న అధికారుల సంఖ్య 2014లో 25% మేర ఉండగా, ఇప్పుడు అది తగ్గింది. విధానాలను రూపొందించి అవి అమలయ్యేలా చూడటం కేంద్రం ప్రధాన విధి. ఇందులో రాష్ట్రాలకూ పాత్ర ఉంటుంది. ఒకవేళ కేంద్రం వద్ద తగిన సంఖ్యలో అధికారులు లేకపోతే పరిపాలన వేగం మందగిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు అఖిల భారతస్థాయి పాత్ర ఉంటుంది. ఒకవేళ ఈ అధికారులు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితమైతే రాష్ట్ర సర్వీసులకు, ఐఏఎస్ అధికారుల మధ్య తేడా ఉండదు’’ అని అపూర్వ చంద్ర పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం