Padma Bhushan:పద్మభూషణ్ వద్దు..తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. ‘‘పద్మ అవార్డు సంగతి నాకు
కోల్కోతా: కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. ‘‘పద్మ అవార్డు సంగతి నాకు తెలియదు. దాని గురించి ఎవరూ చెప్పలేదు. ఒకవేళ నన్ను ఆ పురస్కారానికి ఎంపిక చేసి ఉంటే.. దాన్ని తిరస్కరిస్తున్నా’’ అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుద్ధదేవ్తో పాటు పార్టీ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నుంచి అవార్డులు స్వీకరించడం తమ విధానం కాదని ఆ పార్టీ.. ట్విటర్లో పేర్కొంది. తాము పనిచేసేది ప్రజల కోసమని, అవార్డుల కోసం కాదని తెలిపింది. గతంలో తమ పార్టీ సీనియర్ నేత ఈఎంఎస్ నంబూద్రిపాద్ కూడా ఇదే రీతిలో అవార్డును తిరస్కరించారని వివరించింది.
బుద్ధదేవ్ కుటుంబ సభ్యులు వద్దనలేదు.. : అధికారులు
పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన విషయాన్ని తెలియజేసేందుకు మంగళవారం ఉదయం బుద్ధదేవ్కు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఫోన్ చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘ఆయనకు అనారోగ్యంగా ఉండటం వల్ల ఆయన సతీమణి ఫోన్లో మాట్లాడారు. అవార్డు విషయాన్ని ఆమెకు తెలియజేశాం. విషయాన్ని బుద్ధదేవ్కు తెలియజేస్తామని ఆమె చెప్పారు’’ అని వివరించాయి. ఆ తర్వాత పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులెవరూ తమను సంప్రదించలేదని పేర్కొన్నాయి. అవార్డుకు ఎంపికైనవారికి ఆ విషయాన్ని ముందే తెలియజేస్తామని, పురస్కారాన్ని స్వీకరించడం వారికి ఇష్టం లేకపోతే తుది జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తామని వివరించాయి.
సంధ్య ముఖర్జీ కూడా..
పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించేందుకు పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ గాయని సంధ్యా ముఖర్జీ నిరాకరించారు. అవార్డు ప్రకటించేందుకు సమ్మతించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు తనను సంప్రదించినప్పుడు ఆమె ఈ మేరకు స్పష్టంచేశారు. ‘‘90 ఏళ్ల వయస్సులో.. దాదాపు 8 దశాబ్దాల పాటు పాటలు పాడిన వ్యక్తికి ‘పద్మశ్రీ’ని ప్రకటించడమంటే.. ఆమె స్థాయిని తగ్గించడమే’’ అని సంధ్యా ముఖర్జీ కుమార్తె సౌమి సేన్గుప్తా స్పష్టంచేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ఒక జూనియర్ ఆర్టిస్ట్కు ఇవ్వడం సబబని, సంధ్యా ముఖర్జీ లాంటి గాయనికి ఇవ్వజూపడం తగదని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు
-
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా