56 మంది భారత జాలరులను విడుదల చేయండి: శ్రీలంక కోర్టు
శ్రీలంక జలాల్లో చేపలు పట్టారన్న అభియోగంతో ఆ దేశ జైళ్లలో మగ్గుతున్న భారత జాలరులు 56 మందిని విడుదల చేయాల్సిందిగా అక్కడి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంక నౌకాదళ
కొలంబో: శ్రీలంక జలాల్లో చేపలు పట్టారన్న అభియోగంతో ఆ దేశ జైళ్లలో మగ్గుతున్న భారత జాలరులు 56 మందిని విడుదల చేయాల్సిందిగా అక్కడి కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీలంక నౌకాదళ అధికారులు డిసెంబరు నెల మధ్యలో ఈ జాలరులను నిర్బంధించగా.. అందరినీ విడుదల చేయాలంటూ ఉత్తర జాఫ్నా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం ట్వీట్ చేసింది. ‘జాలరుల విడుదల వ్యవహారంలో హై కమిషనర్ గోపాల్ బాగ్లే బృందం కృషి అభినందనీయం’ అంటూ భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. అంతకుమునుపు శ్రీలంకకు ఆర్థికసాయానికి సంబంధించి ఇరు దేశాల నడుమ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జాలరులను మానవతా దృక్పథంతో విడుదల చేయాలంటూ భారత అధికారులు శ్రీలంకను కోరారు. శ్రీలంక ఆర్థికమంత్రి బసిల్ రాజపక్స, భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ల నడుమ ఈ విషయమై చర్చలు కూడా జరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ