భద్రతా దళాలపై గ్రనేడ్ దాడి; నలుగురికి గాయాలు
గణతంత్ర దిన వేడుకలకు ఒకరోజు ముందు.. మంగళవారం సాయంత్రం భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ
శ్రీనగర్: గణతంత్ర దిన వేడుకలకు ఒకరోజు ముందు.. మంగళవారం సాయంత్రం భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గ్రనేడ్ రోడ్డు పక్కన పేలింది. ఈ దాడిలో పోలీసు అధికారి తన్వీర్ హుసేన్, మహమ్మద్ షఫీలతోపాటు తన్వీరా, అస్మత్ అనే ఇద్దరు మహిళలు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు నలుగురినీ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతమంతా గాలింపు చేపట్టాయి. గణతంత్ర దిన వేడుకల కోసమని నరగరమంతా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు