భద్రతా దళాలపై గ్రనేడ్ దాడి; నలుగురికి గాయాలు
గణతంత్ర దిన వేడుకలకు ఒకరోజు ముందు.. మంగళవారం సాయంత్రం భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ
శ్రీనగర్: గణతంత్ర దిన వేడుకలకు ఒకరోజు ముందు.. మంగళవారం సాయంత్రం భద్రతా దళాలపైకి ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే హరిసింగ్ హై స్ట్రీట్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో గ్రనేడ్ రోడ్డు పక్కన పేలింది. ఈ దాడిలో పోలీసు అధికారి తన్వీర్ హుసేన్, మహమ్మద్ షఫీలతోపాటు తన్వీరా, అస్మత్ అనే ఇద్దరు మహిళలు గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులు నలుగురినీ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతమంతా గాలింపు చేపట్టాయి. గణతంత్ర దిన వేడుకల కోసమని నరగరమంతా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్లో 3లక్షల కండోమ్లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు
-
Israel Hamas Conflict: యుద్ధ తంత్రంగా ఆకలి మంటలు: ఐరాస ఆందోళన
-
Meta: ఎన్నికల్లో ఏఐ నకిలీ సమాచార కట్టడి.. మెటా ప్రత్యేక చర్యలు
-
YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైకాపా ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు