పారిశుద్ధ్య కార్మికుల్లో.. 65% మంది నిరక్షరాస్యులే
భారత్లో వ్యర్థాలు సేకరించేవారు, వీధులు ఊడ్చేవారు, సఫాయి కార్మికుల్లో 65% మంది నిరక్షరాస్యులేనని, ఇందులోనూ ఎక్కువమంది సామాజికంగా వెనుకబడినవర్గాల వారే ఉన్నారని ఐక్యరాజ్య సమితి
దిల్లీ: భారత్లో వ్యర్థాలు సేకరించేవారు, వీధులు ఊడ్చేవారు, సఫాయి కార్మికుల్లో 65% మంది నిరక్షరాస్యులేనని, ఇందులోనూ ఎక్కువమంది సామాజికంగా వెనుకబడినవర్గాల వారే ఉన్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) సర్వే పేర్కొంది. ‘భారత్లో సఫాయీల సామాజిక-ఆర్థిక విశ్లేషణ’ పేరిట చేపట్టిన ఈ సర్వే నివేదిక మంగళవారం విడుదలైంది. దేశవ్యాప్తంగా 14 నగరాల్లోని 9,300 మంది పారిశుద్ధ్య పనివారు ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రతి 10 మంది సఫాయీ కార్మికుల్లో ఆరుగురికి బ్యాంకు ఖాతాలున్నాయి. వీరిలో 21% మందే జన్ధన్ యోజన ప్రయోజనాలు అందుకున్నారు. చాలా తక్కువమందే డిజిటల్ చెల్లింపు విధానాలు వినియోగిస్తున్నారు. 90% మందికి ఆధార్, ఓటరు కార్డులుండగా, 60% మందికి జనన, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు లేవు. మొత్తం సఫాయీలలో సగం మందే రేషన్ సరకులు పొందుతున్నారు. ఇక ఆరోగ్య బీమా ఉన్నవారు 5%కి మించిలేరు. తాత్కాలిక షెడ్డులు, అద్దె ఇళ్లలోనే ఎక్కువమంది నివాసం ఉంటున్నారని, శౌచాలయాలు ఉన్నవారు/వినియోస్తున్న వారు 60% మందేనని నివేదిక పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు