ఇద్దరు చిన్నారులను చంపి.. కళ్లు పెకలించి..

ఝార్ఖండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను వారి సమీప బంధువే అత్యంత క్రూరంగా హత్య చేసి కళ్లు పెకలించివేశాడు. పాకుడ్‌ జిల్లాలోని అంబాడిహ్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Published : 29 Jan 2022 04:11 IST

పాకుర్‌: ఝార్ఖండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే దారుణం వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను వారి సమీప బంధువే అత్యంత క్రూరంగా హత్య చేసి కళ్లు పెకలించివేశాడు. పాకుడ్‌ జిల్లాలోని అంబాడిహ్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మర్షిలా మరాండి(10), బాబులాల్‌ మరాండి(8)లను వారి తండ్రి సోదరుడైన నెహ్రూ మరాండి గురువారం తన ఇంటికి పిల్చుకెళ్లాడు. ఆ తర్వాత సమీపంలోని ఓ పొలంలో పడిఉన్న చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించి సమాచారమిచ్చినట్లు పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు