మొన్న ఉత్తరాఖండ్‌ టోపీ.. నేడు పంజాబ్‌ పగిడీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. అధికారిక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహార్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గణతంత్ర దినోత్సవాన ఉత్తరాఖండ్‌ టోపీ.. మణిపుర్‌ ఉత్తరీయం ధరించిన మోదీ.. శుక్రవారం

Published : 29 Jan 2022 05:26 IST

దిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. అధికారిక కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహార్యం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గణతంత్ర దినోత్సవాన ఉత్తరాఖండ్‌ టోపీ.. మణిపుర్‌ ఉత్తరీయం ధరించిన మోదీ.. శుక్రవారం దేశరాజధానిలో జరిగిన జాతీయ కేడెట్‌ కోర్‌ (ఎన్‌సీసీ) ర్యాలీలో సిక్కులు ధరించే తలపాగా (పగిడీ)తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. నీలం రంగు పగిడీ, నల్ల కళ్లద్దాలతో ప్రసంగం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, గోవాతో పాటు పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే నెల జరగనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని