Supreme Court: భర్త ఆస్తిపై ఆ భార్యకు పూర్తి హక్కులు ఉండవు
హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లుచేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాసిన పక్షంలో...
హరియాణా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
దిల్లీ: హిందూ వ్యక్తి తన భార్య పోషణ, బాగోగుల నిమిత్తం ఏర్పాట్లుచేసి, తాను సంపాదించిన ఆస్తిని భార్య తన జీవితాంతం అనుభవించేలా పరిమితులతో కూడిన వీలునామా రాసిన పక్షంలో... సదరు ఆస్తిపై ఆమెకు సంపూర్ణ హక్కులు దఖలు పడవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. హరియాణాకు చెందిన తులసీరామ్... మొదటి భార్య చనిపోవడంతో రెండో భార్య రామ్దేవి, కుమారుడి పేరున 1968లో వీలునామా రాశారు. తన ఆస్తిని ఆమె జీవిత కాలమంతా అనుభవిస్తూ, దాని ద్వారా వచ్చే ఆదాయంతో జీవించవచ్చని పేర్కొన్నాడు. ఆమె మరణానంతరం మాత్రం యావత్ ఆస్తి సంపూర్ణంగా తన కుమారుడికే చెందాలని అందులో స్పష్టం చేశాడు. తులసీరామ్ 1969లో మృతిచెందాడు. కొందరు వ్యక్తులు రామ్దేవి నుంచి ఆ ఆస్తిని కొనుగోలు చేయడం వివాదానికి దారితీసింది. చివరికి ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టుకు చేరింది. ‘‘రామ్దేవి నుంచి ఈ ఆస్తిని కొనుగోలుచేసిన వ్యక్తులకు అనుకూలంగా సేల్ డీడ్లను కొనసాగించలేం’’ అని ధర్మాసనం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు