హిజాబ్ ధరించిన విద్యార్థినులకు కళాశాల ప్రవేశం నిరాకరణ
కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను గురువారం లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారం మూసివేశారు.
ఉడుపి, న్యూస్టుడే: కర్ణాటకలోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థినులను గురువారం లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారం మూసివేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు, ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. విద్యార్థినులు స్పందిస్తూ.. ప్రవేశాల సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు చెబితే ఎలా? అని ప్రశ్నించారు. వార్షిక పరీక్షలు 2 నెలల్లో ఉండగా, ఇప్పుడిలా ఆంక్షలు పెడితే ఎలాగని విమర్శించారు. విద్యార్థినులను కళాశాల మైదానం వెలుపలే కొద్దిసేపు గడిపి వెనుదిరిగారు. జిల్లా మంత్రి అంగార మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల్ని అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. ఇదే విషయంపై హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కారాదని హితవు పలికారు. మరోవైపు విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించకపోవడాన్ని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఖండించారు. బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నామంటూ కేంద్రం డొల్లమాటలు చెబుతోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్