Karnataka: కర్ణాటకను కుదిపేస్తున్న ‘హిజాబ్’ వివాదం
కర్ణాటకలో హిజాబ్ వస్త్ర ధారణ వివాదం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాగల్కోటె, దావణగెరె, మండ్య,
రెండు వర్గాల విద్యార్థుల పోటాపోటీ నినాదాలు
లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం
మూడు రోజులు కళాశాలల మూసివేత
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వస్త్ర ధారణ వివాదం మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాగల్కోటె, దావణగెరె, మండ్య, బెళగావి, ఉడుపి, శివమొగ్గ, చిక్కమగళూరు, రాయచూరు, కలబురగి, కోలారు తదితర జిల్లాల్లోని కళాశాలల వద్ద ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు ఆందోళనలకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరిలో ఉడుపిలోని ప్రభుత్వ కళాశాలలో ఆరుగురు విద్యార్థినిలు హిజాబ్ ధరించి హాజరయ్యారు. దీంతో వారిని కళాశాలలోకి వచ్చేందుకు అనుమతించలేదు. పోటీగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి వచ్చారు. ఇలా.. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.
కాషాయ జెండా ఎగరవేసి..
హిజాబ్ను వ్యతిరేకించే క్రమంలో కొందరు విద్యార్థులు శివమొగ్గలోని కళాశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రత్యేకించిన స్తంభంపై కాషాయ జెండాను ఎగురవేశారు. అనంతరం ‘జై శ్రీరాం’ అంటూ నినదించారు.
సహనంతో ఉండండి: ముఖ్యమంత్రి బొమ్మై
న్యాయస్థానం తీర్పు వెల్లడించేంత వరకు సహనంతో ఉండాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వారిని ఎవరూ రెచ్చగొట్టే ప్రయత్నం చేయరాదని కోరారు.
లోక్సభలోనూ ప్రతిధ్వని: హిజాబ్ అంశం లోక్సభలోనూ ప్రతిధ్వనించింది. కాంగ్రెస్, డీఎంకే, ఐయూఎంఎల్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, జేఎంఎం పార్టీ సభ్యులు ఈ అంశంపై లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. విద్యార్థులంతా కళాశాలలు, యాజమాన్యం సూచించిన ఏకరూప వస్త్రాలనే ధరించాలన్నారు.
* రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న కర్ణాటక విద్యార్థినులు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నానంటూ ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
సంయమనమే రక్ష: హైకోర్టు
‘అత్యంత సున్నితమైన సామాజిక అంశం ఎంతటి ఉద్రిక్తతలకు దారి తీసిందో మాధ్యమాల ద్వారా చూస్తున్నాం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు వీధుల్లో గొడవలకు దిగటం, నినాదాలు చేస్తూ దాడులకు పాల్పడటం, పోలీసులతో దెబ్బలు తినడం సరైన చర్య కాదు. ఈ సంఘటనలతో న్యాయవాదులు కూడా కలత చెందారు. ఆందోళన మనస్తత్వంతో సరైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ సమయంలోనే ప్రజలంతా సంయమనం పాటించాలి’’ అని కర్ణాటక హైకోర్టు సూచించింది. విద్యార్థులంతా శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రజల మనోభావాలు, విశ్వాసాలను గౌరవిస్తూనే తగిన నిర్ణయం తీసుకుంటామని జస్టిస్ కృష్ణ దీక్షిత్ తెలిపారు. హిజాబ్ వివాదంపై కుందాపుర, ఉడుపి జిల్లాల విద్యార్థినులు దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిగింది. విచారణ ప్రారంభించిన సమయంలో ఓ విద్యా సంస్థలో కాషాయ పతాకాన్ని ఎగరవేయడం, కళాశాలల ఆవరణల్లో అలజడులు జరుగుతున్న అంశం న్యాయమూర్తులు, న్యాయవాదులకు తెలిసి విచారం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడులో హిజాబ్ వస్త్రధారణలపై ఆయా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ధర్మాసనం పరిశీలించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!