విస్తృత ధర్మాసనానికి హిజాబ్ వివాదం
కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం పలుచోట్ల ఆందోళనలు జరగ్గా.. బుధవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో
హైకోర్టు సీజేకు సిఫార్సు చేసిన ఏకసభ్య ధర్మాసనం
మానవతా దృక్పథంతో తీర్పు ఇవ్వలేమని స్పష్టీకరణ
ఈనాడు డిజిటల్, బెంగళూరు, మండ్య, న్యూస్టుడే: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. మంగళవారం పలుచోట్ల ఆందోళనలు జరగ్గా.. బుధవారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. హిజాబ్పై మరింత విస్తృతంగా విచారించాల్సిన అవసరం ఉందని ఏకసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలంటూ జస్టిస్ కృష్ణ దీక్షిత్.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిఫార్సు చేశారు. బుధవారం మరో 5 పిటిషన్లు దాఖలయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మధ్యంతర తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కానీ రాజ్యాంగ నిబంధనలతో ముడిపడి, దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ అంశంపై మానవతా దృక్పథంతో తీర్పు ఇవ్వలేమని జస్టిస్ దీక్షిత్ అన్నారు.
తీర్పు తర్వాత ప్రభుత్వ నిర్ణయం
న్యాయస్థానం తీర్పు వెల్లడించేంత వరకు ఏకరూప దుస్తుల విధానంపై యథాతథస్థితిని అనుసరించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించినా ఎలాంటి తీర్మానాలు చేయలేదు. శుక్రవారం వరకు కళాశాలలకు సెలవు ప్రకటించటంతో ఆలోగా తీర్పు వస్తుందని భావిస్తోంది. కానీ పరీక్షల నేపథ్యంలో మరిన్ని రోజులు సెలవులు ప్రకటించటం సరికాదన్న అభిప్రాయంతో అడ్వకేట్ జనరల్తో చర్చించి తగిన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ముందు జాగ్రత్తగా పలు విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీసులతో కవాతు నిర్వహించారు.
ఆ విద్యార్థినికి రూ.5 లక్షల నజరానా
తీవ్ర వ్యతిరేకతల నడుమ మంగళవారం మండ్యలో హిజాబ్కు అనుకూలంగా నినదించిన విద్యార్థిని మనో ధైర్యానికి మెచ్చుకుని జమాయత్ ఉలేమా ఇ హింద్ సంస్థ ఆమెకు రూ.5 లక్షల నజరానా ప్రకటించింది.
ఇష్టమైనవి ధరించడం మహిళల హక్కు
‘‘నచ్చిన రీతిలో వస్త్రధారణ చేసే స్వేచ్ఛ మహిళలకు ఉంటుంది. ఘూంఘట్, జీన్స్, చీర, హిజాబ్.. ఇలాంటివాటిలో దేన్ని ధరించాలో నిర్ణయించుకునే హక్కు ఆడవారికి ఉంటుంది. దానిని రాజ్యాంగం కల్పించింది. వేధింపుల్ని ఆపండి’’
- ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
దీన్ని ఆపాలి
‘‘హిజాబ్ ధరించిన విద్యార్థులను తరగతిలోకి అనుమతించకపోవటం దారుణం? చదువా, హిజాబాల్లో ఏదో ఒకటి ఎంచుకునేలా కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. భారత నేతలు దీన్ని ఆపాలి’
- మలాల, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత
భారత్లో హక్కుల కాలరాత
‘‘ముస్లిం బాలికలకు విద్య అందకుండా వారి మానవ హక్కుల్ని భారత్ కాలరాస్తోంది. ఇది పూర్తిగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. భారత్లో ముస్లింల పరిస్థితిని ప్రపంచం గుర్తించాలి’
- షా మహమూద్ ఖురేషి, పాక్ విదేశాంగ మంత్రి
పాక్ పాఠాలు అక్కర్లేదు
‘‘భారత్ అంతర్గత అంశమైన హిజాబ్ వివాదంపై పాక్ స్పందించడం ఆక్షేపనీయం. పాక్ తన సొంత విషయాలను చూసుకోవాలని, మలాలను కాల్పుల నుంచి కాపాడలేకపోయిన దేశం.. భారత్లో బాలికల విద్య గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తగదు’’
- అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం అధినేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్