సర్పంచి అభ్యర్థులకు రాత పరీక్ష పెట్టిన గ్రామస్థులు.. ఎక్కడంటే?
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన ఘటన చర్చనీయాంశమైంది. కుత్రా పంచాయతీ తరఫున సర్పంచి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా కుత్రా పంచాయతీ మలుపడ గ్రామంలో సర్పంచి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన ఘటన చర్చనీయాంశమైంది. కుత్రా పంచాయతీ తరఫున సర్పంచి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను మలుపడ గ్రామస్థులు శనివారం సమావేశ పరిచారు. తాము పెట్టే రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఓట్లేస్తామని చెప్పడంతో 8 మంది రాత పరీక్షకు సిద్ధమయ్యారు. 7 ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం వారికి అందజేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో మీరు చేసిన సమాజ సేవలు ఏమిటి?, మీరు గెలిస్తే రానున్న ఐదేళ్లలో చేసే అభివృద్ధి పనులేంటి?, ఇప్పుడు ఇంటింటికీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. గెలిచిన తర్వాత యోగక్షేమాలు తెలుసుకునేందుకు వస్తారా? వంటి ప్రశ్నలు అందులో ఉన్నాయి. ఈ రాత పరీక్షలో ముగ్గురు ఉత్తీర్ణులు కాగా, ఐదుగురు ఫెయిలైనట్లు గ్రామస్థులు ప్రకటించారు. ఈ ముగ్గురిలో గ్రామస్థులు ఎవరికి ఓటు వేయనున్నారన్న ఆసక్తి చుట్టుపక్కల గ్రామాల్లో నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్