విధాన సభలోనూ హిజాబ్ వివాదం
కర్ణాటక విధాన సభ సమావేశాల్లోనూ హిజాబ్ వివాదం కొనసాగింది. సోమవారం ప్రారంభమైన సమావేశాలకు హిజాబ్ వివాదాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. హిజాబ్ను అడ్డుకునేందుకే కాషాయ కండువాలతో విద్యార్థులు
నల్లబ్యాడ్జీలతో హాజరైన కాంగ్రెస్ సభ్యులు
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కర్ణాటక విధాన సభ సమావేశాల్లోనూ హిజాబ్ వివాదం కొనసాగింది. సోమవారం ప్రారంభమైన సమావేశాలకు హిజాబ్ వివాదాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. హిజాబ్ను అడ్డుకునేందుకే కాషాయ కండువాలతో విద్యార్థులు హాజరయ్యేలా భాజపా ప్రేరేపించినట్లు విపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. త్వరలో ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుతుందని ఇటీవల వ్యాఖ్యానించిన మంత్రి కేఎస్ ఈశ్వరప్పను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. హిజాబ్తో కాంగ్రెస్ సభ్యురాలు, కాషాయ వస్త్రంతో భాజపా సభ్యురాలు ఈ సమావేశాలకు హాజరయ్యారు.
* సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సున్నిత జిల్లాల్లో ఆంక్షలు కొనసాగించారు. విద్యార్థినులు హిజాబ్ తొలగించిన తర్వాతనే తరగతులకు హాజరైనట్లు మండ్య, ఉడుపి జిల్లా అధికారులు వెల్లడించారు. శివమొగ్గలో 13మంది విద్యార్థినులు హిజాబ్ తొలగించేందుకు నిరాకరిస్తూ పరీక్షలను కూడా బహిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్