వందేళ్ల తర్వాత నిజాం - మైసూర్‌ వారసుల భేటీ

దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్‌ నిజాం, మైసూర్‌ వడయార్‌ రాజ కుటుంబీకుల వారసులు సమావేశమయ్యారు. ఈమేరకు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలిఖాన్‌ మనుమడు నవాబ్‌ మీర్‌ నజాఫ్‌ అలిఖాన్‌, యదువీర్‌ క్రిష్ణదత్త

Published : 19 Feb 2022 06:41 IST

మైసూర్‌: దాదాపు వందేళ్ల తర్వాత హైదరాబాద్‌ నిజాం, మైసూర్‌ వడయార్‌ రాజ కుటుంబీకుల వారసులు సమావేశమయ్యారు. ఈమేరకు ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలిఖాన్‌ మనుమడు నవాబ్‌ మీర్‌ నజాఫ్‌ అలిఖాన్‌, యదువీర్‌ క్రిష్ణదత్త చామరాజ వడయార్‌లు మైసూర్‌ ప్యాలెస్‌లో భేటీ అయ్యారు. మాజీ పాలకుల వారసుల కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేసే విషయమై ఇరువురూ ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా అసఫ్‌ జాహీలు, మీర్‌ ఉస్మాన్‌ అలిఖాన్‌ల గొప్పతనాన్ని వడయార్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని