హిజాబ్ ధరించిన విద్యార్థినుల బహిష్కరణ
కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. శివమొగ్గ జిల్లా శిరాలకొప్పలోని పీయూ విద్యార్థినులు హిజాబ్ నిషేధాన్ని నిరసిస్తూ ఆందోళన చేయటంతో వారిని కళాశాల నుంచి బహిష్కరించారు. శుక్రవారం ఆందోళన చేసిన 58 మంది
కర్ణాటకలో కొనసాగుతున్న వివాదం
ఈనాడు డిజిటల్, బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్ వివాదం అంతకంతకూ రాజుకుంటోంది. శివమొగ్గ జిల్లా శిరాలకొప్పలోని పీయూ విద్యార్థినులు హిజాబ్ నిషేధాన్ని నిరసిస్తూ ఆందోళన చేయటంతో వారిని కళాశాల నుంచి బహిష్కరించారు. శుక్రవారం ఆందోళన చేసిన 58 మంది విద్యార్థినులను తొలగించినట్లు సమాచారం అందించారు. పోలీసుల సాయంతో శనివారం కళాశాలలకు వచ్చినా సిబ్బంది తమను లోనికి అనుమతించలేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దావణగెరె, బెళగావి, బళ్లారి, కొప్పళ, రామనగర జిల్లాల్లోనూ విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాలలకు హాజరవటంతో సిబ్బంది అడ్డుకున్నారు. బెళగావిలోని విజయ పారా మెడికల్ కళాశాలకు సెలవులు ప్రకటించినట్లు విద్యార్థినులు ఆరోపించారు.కోర్టు తీర్పు వెల్లడించేంత వరకు వసతిగృహాలు, ఆంగ్ల మాధ్యమ మౌలానా ఆజాద్ కళాశాలల్లో హిజాబ్ లేదా స్కార్ఫ్లను ధరించి రాకూడదని రాష్ట్ర అల్ప సంఖ్యాక సంక్షేమ శాఖ ఆదేశించింది.
తమిళనాడులోని పోలింగ్ కేంద్రంలో...
చెన్నై (ఆర్కేనగర్), న్యూస్టుడే: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమిళనాడులోని మదురై జిల్లా మేలూర్ మున్సిపాలిటీ 8వ వార్డులోని అల్ అమీన్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేయడానికి ఓ ముస్లిం మహిళ హిజాబ్ ధరించి వచ్చింది. హిజాబ్ తొలగించి ఓటు వేయాలని భాజపా ఏజెంట్ గిరిరాజన్ ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో డీఎంకే, అన్నాడీఎంకే వారు అతని తీరును వ్యతిరేకించారు. దీంతో కొంతసేపు అక్కడ పోలింగ్ నిలిపేశారు. ఏజెంట్లను బయటకు పంపించడంతో పోలింగ్ కొనసాగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు