Visa: ఇమ్మిగ్రేషన్‌ వీసా సేవల పథకం పొడిగింపు

కేంద్రం ఇమ్మిగ్రేషన్‌ వీసా ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ ట్రాకింగ్‌ (ఐవీఎఫ్‌ఆర్టీ) పథకాన్ని మరో అయిదేళ్లపాటు పొడిగించింది. 2026 మార్చి 31 దాకా ఇది వర్తిస్తుంది. ఇందుగ్గాను రూ.1,364.88 కోట్ల ఆర్థికవ్యయం

Updated : 26 Feb 2022 08:37 IST

దిల్లీ: కేంద్రం ఇమ్మిగ్రేషన్‌ వీసా ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ ట్రాకింగ్‌ (ఐవీఎఫ్‌ఆర్టీ) పథకాన్ని మరో అయిదేళ్లపాటు పొడిగించింది. 2026 మార్చి 31 దాకా ఇది వర్తిస్తుంది. ఇందుగ్గాను రూ.1,364.88 కోట్ల ఆర్థికవ్యయం అంచనా వేశారు. ఈ పథకం ఇమ్మిగ్రేషన్‌ వీసా జారీ, విదేశీయుల నమోదు, భారత్‌లో వారి కదలికలను కనిపెట్టడానికి సంబంధించిన విధుల అనుసంధానం, సానుకూలతకు ప్రయత్నిస్తుంది. ఇమ్మిగ్రేషన్‌ వీసా సేవల ఆధునికీకరణ, మెరుగుదల విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం పొడిగింపు సూచిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్త నెట్‌వర్కుతో పనిచేస్తుంది. ఐవీఎఫ్‌ఆర్టీ పథకం అమలులోకి వచ్చాక వీసాల జారీ పెరగడమే కాకుండా.. అంతకుమునుపు 15 నుంచి 30 రోజుల సమయం పడుతుండగా, ఇపుడు కేవలం మూడు రోజుల్లోపే ఈ-వీసాలు జారీ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత్‌ నుంచి అంతర్జాతీయ రాకపోకలు కూడా గత పదేళ్లలో 3.71 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెరిగినట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని