Reliance: దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్
దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ను ముంబయి (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లో 18.5 ఎకరాలలో విస్తరించిన జియో వరల్డ్ సెంటర్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్....
ముంబయి: దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ను ముంబయి (బాంద్రా కుర్లా కాంప్లెక్స్)లో 18.5 ఎకరాలలో విస్తరించిన జియో వరల్డ్ సెంటర్లో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రారంభించింది. ఇందులో 1.61 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో మూడు ఎగ్జిబిషన్ హాళ్లు, 1.07 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు కన్వెన్షన్ హాళ్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్ కేంద్రం 5జీ నెట్వర్క్తో అనుసంధానమై ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది. ముంబయి నగరానికి ధీరూభాయ్ అంబానీ స్క్వేర్, ఫౌంటెయిన్ ఆఫ్ జాయ్లను అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫౌంటెయిన్లో 8 ఫైర్ షూటర్లు, 392 వాటర్ జెట్లు, 600కు పైగా ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ కన్వెన్షన్ కేంద్రంలోని వంటశాల ద్వారా రోజుకు 18,000 మందికి పైగా ఆహారం అందించే సౌలభ్యం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్