Mamata Banerjee: భారీ కుదుపులకు గురైన మమత విమానం
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం మధ్యలో భారీ కుదుపులకు గురికావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శనివారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)ను
డీజీసీఏ నివేదిక కోరిన బెంగాల్ ప్రభుత్వం
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం మధ్యలో భారీ కుదుపులకు గురికావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శనివారం పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ)ను నివేదిక అడిగింది. ఆమె ప్రయాణించే విమాన మార్గానికి ముందస్తు అనుమతి ఉందా? అనే విషయమై కూడా డీజీసీఏ నుంచి సమాచారం కోరింది. కాగా ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లిన మమత శుక్రవారం సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కాగా.. మధ్యలో భారీ కుదుపులకు గురైంది. పైలట్ చాకచక్యంతో విమానం కోల్కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నప్పటికీ ఆమె వెన్నునొప్పికి గురైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అంశాన్ని ఓ డీజీసీఏ అధికారి వద్ద ప్రస్తావించగా.. దీనిపై నివేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి అన్ని ఘటనలపైనా దర్యాప్తు జరుపుతుంటామని, ప్రముఖులు ప్రయాణించే సందర్భాల్లో ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మమత ప్రయాణించిన ‘దసో ఫాల్కాన్ 2000’ 10.3 టన్నుల బరువుండే తేలికపాటి విమానం. దీనిలో ఇద్దరు విమాన సిబ్బంది సహా గరిష్ఠంగా 19 మంది ప్రయాణించొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్