Ukraine Crisis: ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి
ఉక్రెయిన్లో చదువుకుంటున్న తమిళనాడుకు చెందిన సాయి నికేష్ అనే విద్యార్థి అక్కడి సైన్యంలో చేరారు. కోయంబత్తూరుకు చెందిన సాయి నికేష్ నాలుగేళ్లుగా ఉక్రెయిన్లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు.
కోయంబత్తూరు, న్యూస్టుడే: ఉక్రెయిన్లో చదువుకుంటున్న తమిళనాడుకు చెందిన సాయి నికేష్ అనే విద్యార్థి అక్కడి సైన్యంలో చేరారు. కోయంబత్తూరుకు చెందిన సాయి నికేష్ నాలుగేళ్లుగా ఉక్రెయిన్లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో సైన్యంలో చేరినట్లు సమాచారం. తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇంటికి రావాలని కోరినా అతను రానని చెప్పినట్లు తెలుస్తోంది. తమ కుమారుడిని రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నట్లు వారి ఇంటికి వెళ్లిన అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ