Ukraine Crisis: ఉక్రెయిన్‌ సైన్యంలో చేరిన తమిళనాడు విద్యార్థి

ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తమిళనాడుకు చెందిన సాయి నికేష్‌ అనే విద్యార్థి అక్కడి సైన్యంలో చేరారు. కోయంబత్తూరుకు చెందిన సాయి నికేష్‌ నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు.

Updated : 09 Mar 2022 07:21 IST

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తమిళనాడుకు చెందిన సాయి నికేష్‌ అనే విద్యార్థి అక్కడి సైన్యంలో చేరారు. కోయంబత్తూరుకు చెందిన సాయి నికేష్‌ నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సైన్యంలో చేరినట్లు సమాచారం. తల్లిదండ్రులు ఆందోళన చెంది ఇంటికి రావాలని కోరినా అతను రానని చెప్పినట్లు తెలుస్తోంది. తమ కుమారుడిని రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నట్లు వారి ఇంటికి వెళ్లిన అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని