ఆశిష్ మిశ్ర బెయిల్ను గట్టిగా వ్యతిరేకించాం
లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో అరెస్టు అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రకు బెయిల్ ఇవ్వడాన్ని అలహాబాద్ హైకోర్టులో గట్టిగా వ్యతిరేకించినట్లు సుప్రీంకోర్టుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది.
సుప్రీంకోర్టుకు తెలిపిన యూపీ ప్రభుత్వం
బెయిల్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉందని వెల్లడి
దిల్లీ: లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటన కేసులో అరెస్టు అయిన కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రకు బెయిల్ ఇవ్వడాన్ని అలహాబాద్ హైకోర్టులో గట్టిగా వ్యతిరేకించినట్లు సుప్రీంకోర్టుకు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అతనికి బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానంలో పెండింగ్లో ఉందని వెల్లడించింది. నిందితుడికి బెయిల్ రాకుండా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించలేదన్న ఆరోపణలను తోసిపుచ్చింది. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న వారి పైకి వాహనం దూసుకెళ్లడంతో మృతి చెందిన వారిలో నలుగురు రైతులు ఉన్నారు. బాధిత కుటుంబాల సభ్యులు...ఆశిష్ మిశ్రకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో సాక్షులకు బెదిరింపులు వస్తున్నాయని, యూపీలో భాజపా మళ్లీ విజయం సాధించడంతో బాధిత కుటుంబ సభ్యులకు రక్షణ కరువైందని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నోటీసు జారీ చేయడంతో యూపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాన సాక్షి దిల్జ్యోత్ సింగ్పై మార్చి 10న జరిగిన దాడి ఘటనకు, లఖింపుర్ ఖేరి నిందితులకు సంబంధంలేదని తెలిపింది. హోలీ రోజున గులాల్ చల్లిన సందర్భంలో ఆకస్మికంగా జరిగిన ఘటనగా పేర్కొంది. దాడి సమయంలో ఆశిష్ మిశ్ర ప్రస్తావన కానీ, యూపీలో మళ్లీ భాజపా గెలిచిన విషయాన్ని కానీ నిందితులు ప్రస్తావించలేదని, దిల్జ్యోత్ సింగ్ భద్రత కోసం నియమించిన గన్మెన్తో పాటు స్థానిక సాక్షులు తెలిపారని ప్రభుత్వం వివరించింది. దిల్జ్యోత్ సింగ్పై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, మరుసటి రోజు విడుదల చేసినట్లు అఫిడవిట్లో పేర్కొంది. గత ఏడాది అక్టోబరు 3న లఖింపుర్ ఖేరీలో జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?