నీట్‌ యూజీ పరీక్ష జులై 17న!

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌-యూజీ)ను జులై 17న నిర్వహించే అవకాశం ఉంది. జాతీయ వైద్య కమిషన్‌తో సంప్రదించి ఈ తేదీని నిర్ణయించినట్లు

Published : 01 Apr 2022 06:05 IST

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌-యూజీ)ను జులై 17న నిర్వహించే అవకాశం ఉంది. జాతీయ వైద్య కమిషన్‌తో సంప్రదించి ఈ తేదీని నిర్ణయించినట్లు
తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడనుందని వైద్య విద్యశాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 13 భాషల్లో ఈ పరీక్షను రాయవచ్చు. పరీక్షార్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లను మే 7వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత అయిదు రోజుల వరకు తప్పులను సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తారని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని