Gift: 100 మంది ఉద్యోగులకు ‘కార్లు’ బహుమానం..

చెన్నై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ‘ఐడియాస్‌2ఐటీ’ అనే ఇంజినీరింగ్‌ సంస్థ వందమంది ఉద్యోగులకు కార్లను బహుమానంగా అందించింది. సంస్థ అభివృద్ధికి సేవలందించినందుకు గాను సీఈఓ గాయత్రి వివేకానందన్‌, సంస్థ

Updated : 12 Apr 2022 11:17 IST

వడపళని (చెన్నై), న్యూస్‌టుడే: చెన్నై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ‘ఐడియాస్‌2ఐటీ’ అనే ఇంజినీరింగ్‌ సంస్థ వందమంది ఉద్యోగులకు కార్లను బహుమానంగా అందించింది. సంస్థ అభివృద్ధికి సేవలందించినందుకు గాను సీఈఓ గాయత్రి వివేకానందన్‌, సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ మురళీ వివేకానందన్‌ సమక్షంలో సోమవారం కార్లను అందజేశారు. 2009లో తమ సంస్థను ప్రారంభించినప్పుడు ఆరుగురు ఇంజినీర్లు మాత్రమే ఉండేవారని.. ప్రస్తుతం 500 మందికిపైగా నిపుణులు యూఎస్‌, మెక్సికో, భారత్‌లలో పని చేస్తున్నారని నిర్వాహకులు చెప్పారు. ఫేస్‌బుక్‌,  మైక్రోసాఫ్ట్‌, ఒరాకిల్‌ వంటి పలు దిగ్గజ సంస్థలకు సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టులను తాము అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వందమంది ఉద్యోగులకు కార్లు బహూకరించడం ఆనందంగా ఉందని చెప్పారు. సంస్థ అభివృద్ధికి మూలస్తంభాలుగా సేవలందించిన వారిని అభినందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని