Petrol: రూపాయికే లీటర్‌ పెట్రోల్‌.. ఎగబడ్డ జనం

రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ ఇస్తామన్న ప్రకటనతో.. వందలమంది వాహనదారులు పెట్రోల్‌ బంక్‌కు పోటెత్తారు. మహారాష్ట్ర సోలాపుర్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యాజమాన్యం.. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గురువారం ఈ ఆఫర్‌ ప్రకటించింది.

Updated : 15 Apr 2022 06:05 IST

రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ ఇస్తామన్న ప్రకటనతో.. వందలమంది వాహనదారులు పెట్రోల్‌ బంక్‌కు పోటెత్తారు. మహారాష్ట్ర సోలాపుర్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యాజమాన్యం.. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గురువారం ఈ ఆఫర్‌ ప్రకటించింది. తొలుత వచ్చిన 500 మందికి ఒక్కొక్కరికి రూపాయికే లీటర్‌ చొప్పున పెట్రోల్‌ ఇచ్చింది. ఈ సందర్భంగా భారీసంఖ్యలో వచ్చిన వాహనదారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సామాన్యులకు పెను భారమైన పెట్రో ధరల్ని తగ్గించాలని ప్రధాని మోదీకి సందేశం ఇచ్చేందుకే ఇలా చేశామని బంకు యాజమాన్యం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు