ఎస్బీఐ శాఖలో రూ.11 కోట్ల నాణేల మాయం.. దర్యాప్తు చేపట్టిన సీబీఐ
రాజస్థాన్లోని మెహందీపుర్ బాలాజీకి చెందిన ఎస్బీఐ బ్రాంచిలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయం కావడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కనిపించకుండా పోయిన మొత్తం రూ.3 కోట్లపైనే ఉన్నందున... ఈ ఘటనపై సీబీఐతో విచారణ
దిల్లీ: రాజస్థాన్లోని మెహందీపుర్ బాలాజీకి చెందిన ఎస్బీఐ బ్రాంచిలో రూ.11 కోట్ల విలువైన నాణేలు మాయం కావడంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కనిపించకుండా పోయిన మొత్తం రూ.3 కోట్లపైనే ఉన్నందున... ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ రాజస్థాన్ హైకోర్టును ఎస్బీఐ అభ్యర్థించింది. కోర్టు ఆదేశాల మేరకు రాజస్థాన్ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. నగదు నిల్వల విషయంలో తేడాలు రావడంతో మెహందీపుర్ బాలాజీ శాఖలో నగదు లెక్కించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ బాధ్యతను జైపుర్కు చెందిన ఓ ప్రైవేటు వెండర్కు అప్పగించారు. నాణేలకు సంబంధించి రూ.2 కోట్ల విలువైన 3 వేల సంచులు మాత్రమే అందుబాటులో ఉండగా, మిగతా రూ.11 కోట్ల నాణేలు మాయమైనట్టు లెక్కింపు సందర్భంగా వెల్లడైంది. కొంతమంది వ్యక్తులు గత ఏడాది ఆగస్టు 10న... నగదు లెక్కింపును నిలిపేయాలంటూ వెండర్ వద్ద పనిచేసే సిబ్బందిని బెదిరించినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ