MS Dhoni: 2,000 కోడిపిల్లలను కొన్న మహేంద్రసింగ్ ధోనీ
మాంసకృత్తులు పుష్కలంగా లభించే కడక్నాథ్ కోళ్ల పెంపకంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలోని ఓ సహకార సంస్థకు 2,000 కోడిపిల్లల
రాంచీకి పంపిన మధ్యప్రదేశ్ సహకార సంస్థ
ఝాబువా: మాంసకృత్తులు పుష్కలంగా లభించే కడక్నాథ్ కోళ్ల పెంపకంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్లోని ఝాబువా జిల్లాలోని ఓ సహకార సంస్థకు 2,000 కోడిపిల్లల కోసం ఆర్డర్ ఇచ్చారు. ధోనీ ఆర్డర్ చేసిన 2,000 కడక్నాథ్ కోడిపిల్లలను ఆయన స్వస్థలమైన రాంచీకి శుక్రవారం వాహనంలో పంపించినట్లు ఝాబువా కలెక్టర్ సోమేశ్ మిశ్ర ఆదివారం తెలిపారు. ‘‘ధోనీ లాంటి ప్రముఖులు కడక్నాథ్ కోళ్లను పెంచేందుకు ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామం. ఈ పిల్లల కోసం ఎవరైనా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. దానివల్ల జిల్లాలో వీటిని పెంచుతున్న గిరిజనులకు మేలు కలుగుతుంది’’ అని ఆయన వివరించారు. ఝాబువా కృషి విజ్ఞాన కేంద్రం బాధ్యుడు డాక్టర్ ఐఎస్ తోమర్ మాట్లాడుతూ.. ధోనీ గతంలోనూ ఆర్డర్ చేశారని, బర్డ్ ఫ్లూ కారణంగా ఆ సమయంలో సరఫరా చేయడం కుదరలేదని వెల్లడించారు. రాంచీ పంపించిన 2,000 కోడిపిల్లలకు టీకాలు వేశామని, ధోనీ వ్యవసాయ క్షేత్రంలో వీటిని పెంచేందుకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన మేనేజర్ చెప్పారని సహకార సంస్థ నిర్వాహకుడు వినోద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు