‘ఆ అస్థి పంజరాలు యూపీ, బిహార్, బెంగాల్కు చెందినవారివి’
పంజాబ్లోని అజ్నాలాలో ఓ పాడుబడిన బావిలో 2014లో బయటపడిన సామూహిక అస్థి పంజరాల గుట్టును అణు, కణ పరిశోధన సంస్థ(సీసీఎంబీ) ఛేదించింది. ఇవి గంగా నది మైదాన ప్రాంతాలైన ఉత్తర్ప్రదేశ్, బిహార్, బెంగాల్కు చెందిన అమరవీరులవని తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: పంజాబ్లోని అజ్నాలాలో ఓ పాడుబడిన బావిలో 2014లో బయటపడిన సామూహిక అస్థి పంజరాల గుట్టును అణు, కణ పరిశోధన సంస్థ(సీసీఎంబీ) ఛేదించింది. ఇవి గంగా నది మైదాన ప్రాంతాలైన ఉత్తర్ప్రదేశ్, బిహార్, బెంగాల్కు చెందిన అమరవీరులవని తెలిపింది. ఈ అస్థి పంజరాలపై శాస్త్రీయ ఆధారాల కోసం పంజాబ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ జె.ఎస్.సెహ్రావత్, సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్, లఖ్నవూలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పరిశోధనలు చేపట్టాయి. డీఎన్ఏ విశ్లేషణకు 50 నమూనాలను, ఐసోటోప్ విశ్లేషణకు 85 నమూనాలను పరిశోధించారు. రెండు పద్ధతుల్లోనూ విశ్లేషించగా అస్థి పంజరాలు పంజాబ్ లేదా పాకిస్థాన్లో నివసిస్తున్నవారివి కాదని తేలింది. వాటి డీఎన్ఏ ఉత్తర్ప్రదేశ్, బిహార్, బెంగాల్కు చెందిన పూర్వీకులతో సరిపోలాయని డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ‘ఈ ఫలితాలు చారిత్రక ఆధారాలకు అనుగుణంగా ఉన్నాయి. 26వ బెంగాల్ పదాతిదళ బెటాలియన్లో బెంగాల్ తూర్పు భాగం, ఒడిశా, బిహార్, ఉత్తర్ప్రదేశ్కు చెందినవారు ఉండేవారు’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ జె.ఎస్.సెహ్రావత్ అన్నారు. పురాతన డీఎన్ఏ అధ్యయనం గతంతో పాటు చారిత్రక దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం