ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందని..
ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందన్న కోపంతో మధ్యప్రదేశ్లో ఓ యువకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. యువతి నివసిస్తున్న మూడంతస్తుల భవనానికి నిప్పు పెట్టాడు. దీంతో ఆ భవనంలో
మూడంతస్తుల భవనాన్ని తగులబెట్టిన యువకుడు
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 9 మంది మృతి
ఇండోర్: ప్రేమించిన అమ్మాయి నిరాకరించిందన్న కోపంతో మధ్యప్రదేశ్లో ఓ యువకుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. యువతి నివసిస్తున్న మూడంతస్తుల భవనానికి నిప్పు పెట్టాడు. దీంతో ఆ భవనంలో వివిధ ఫ్లాట్లలో నివసిస్తున్న తొమ్మిదిమంది మంటల్లో కాలిబూడిదయ్యారు. తీవ్రగాయాలతో మరో 9 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘోర విషాదకర సంఘటన శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇండోర్లో రద్దీగా ఉండే విజయ్నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 50 సీసీటీవీల విశ్లేషణ అనంతరం ఈ దారుణానికి సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్ అనే యువకుడు పాల్పడినట్లు నిర్ధారించారు. తెల్లవారుజామున దీక్షిత్ భవనం దగ్గరకు వచ్చాడు. అక్కడ ఉన్న ఓ స్కూటర్ పెట్రోల్ ట్యాంకులో నిప్పుపెట్టాడు. దీంతో మంటలు పార్కింగ్ ప్రాంతమంతా అలముకొని మొత్తం భవనాన్నే కబళించాయి. ఫ్లాట్లలో నివాసముంటున్న వారు ఊపిరి ఆడక మంటల్లో కాలిబూడిదయ్యారు. కొందరు ప్రాణాలకు తెగించి బాల్కనీ, కిటీకీల్లోంచి దూకేశారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. మంట పెట్టిన దీక్షిత్ మళ్లీ ఓ గంట అనంతరం భవనం దగ్గరకు వచ్చి సమీపంలోని సీసీటీవీలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశాడు. వీలుకాకపోవడంతో పరారయ్యాడు. ఆ యువకుడు ప్రేమించిన యువతి సురక్షితంగా ఉందని, నిందితుడి కోసం వేట ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.