Land Dispute: భూ వివాదంలో 108 ఏళ్ల తర్వాత తీర్పు!
భారత్లో సుదీర్ఘకాలం నడిచిన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న భూవివాదంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది! 1914లో బిహార్లోని భోజ్పుర్ జిల్లా, ఆరా సివిల్ కోర్టులో ఈ దావా దాఖలైంది. కోయిల్వార్
దిల్లీ: భారత్లో సుదీర్ఘకాలం నడిచిన కేసుల్లో ఒకటిగా భావిస్తున్న భూవివాదంలో ఎట్టకేలకు తీర్పు వెలువడింది! 1914లో బిహార్లోని భోజ్పుర్ జిల్లా, ఆరా సివిల్ కోర్టులో ఈ దావా దాఖలైంది. కోయిల్వార్ గ్రామంలో మూడెకరాల వివాదాస్పద భూమికి సంబంధించి యాజమాన్య హక్కుల కోసం రాజ్పూత్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని వేశారు. ఎట్టకేలకు భోజ్పుర్ అదనపు జిల్లా జడ్జి స్వేతాసింగ్ మార్చి 11న ఈ కేసులో తీర్పు వెలువరించారు. కేసు వేసిన పార్టీకే ఈ భూమి చెందుతుందని అందులో పేర్కొన్నారు. బిహార్ రాజధాని పట్నాకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఈ వివాదాస్పద స్థలం ఉంది. మున్సిపాలిటీగా మారిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎకరం రూ.5 కోట్లు పలుకుతోంది.
కేసు ఇదీ... బ్రిటిష్ హయాంలో అజ్హర్ ఖాన్ అనే వ్యక్తికి కొయిల్వార్లో 9 ఎకరాల స్థలం ఉండేది. ఇందులో అతని వారసుల నుంచి సేకరించిన మూడు ఎకరాల స్థలం విషయమై రెండు రాజ్పూత్ కుటుంబాల మధ్య వివాదం నెలకొంది. రాజీ కుదుర్చుకునేందుకు ఉభయ పక్షాలు ససేమిరా అంగీకరించలేదు. దీంతో కేసు విచారణ శతాబ్దానికి పైగా సాగుతూ వచ్చింది. ఎన్నో విచారణల అనంతరం ఈ కేసు వేసిన దర్బారీసింగ్ మునిమనుమడు అతుల్సింగ్ తదితరులకు అనుకూలంగా జడ్జి తీర్పు చెప్పారు. ‘‘1914 నుంచి సుదీర్ఘకాలం విచారణ సాగడంతో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయి. ఇప్పటికైనా ఈ వివాదానికి తెర దించాల్సిన అవసరముంది. అయినా, ఇది ఇక్కడితో ఆగుతుందని చెప్పలేం’’ అని తీర్పు సందర్భంగా జడ్జి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు