Case Hearing in Whatsapp: ‘వాట్సప్’లో వ్యాజ్యం విచారణ
ఓ కేసు విచారణను వాట్సప్ వీడియోకాల్లో మద్రాస్ హైకోర్టు తొలిసారి నిర్వహించి తీర్పునిచ్చింది. వినూత్న రీతిలో ఈ విచారణను జస్టిస్ జీఆర్ స్వామినాథన్ చేపట్టారు.
తొలిసారి నిర్వహించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై (ట్రిప్లికేన్), న్యూస్టుడే: ఓ కేసు విచారణను వాట్సప్ వీడియోకాల్లో మద్రాస్ హైకోర్టు తొలిసారి నిర్వహించి తీర్పునిచ్చింది. వినూత్న రీతిలో ఈ విచారణను జస్టిస్ జీఆర్ స్వామినాథన్ చేపట్టారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులున్నాయి. అత్యవసర పిటిషన్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు విచారించేందుకు కొన్ని వెసులుబాట్లను కల్పించారు. ధర్మపురి జిల్లా పాపరపట్టి గ్రామంలో శ్రీ అభీష్ట వరదరాజస్వామి ఆలయ రథోత్సవం సోమవారం నిర్వహించకుండా ఆపేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులిచ్చింది. వాటిని నిలిపేయాలని ఆలయ ధర్మకర్త పీఆర్ శ్రీనివాసన్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు జస్టిస్ స్వామినాథన్ వాట్సప్లో విచారణకు సిద్ధమయ్యారు. ఆదివారం తమిళనాడులోని నాగర్కోయిల్లో ఓ వివాహ వేడుకలో ఉన్నప్పటికీ న్యాయమూర్తి సుముఖత తెలిపారు. న్యాయమూర్తితోపాటు పిటిషన్దారు, ఆయన తరఫు న్యాయవాది, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఆర్.షణ్ముగ సుందరం వీడియోకాల్లోకి వచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ మధ్యే తంజావూరు జిల్లాలో రథోత్సవంలో ప్రమాదం జరిగినందున భద్రత దృష్ట్యా ఉత్తర్వులిచ్చినట్లు కోర్టుకు ఏజీ వివరించారు. ఆలయ కమిటీ నిబంధనలు పాటిస్తూ రథోత్సవాన్ని నిర్వహించాలని జస్టిస్ స్వామినాథన్ ఆదేశించారు. రథం తిరిగే ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఆపేయాలని సూచించారు. భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత దేవాదాయశాఖపై ఉందని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..