
రోజూ ఇల్లు ఊడుస్తున్నారు!
గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు భేష్
ఆసియా పసిఫిక్ దేశాల్లో మనదే ముందంజ
దిల్లీ: గృహ పరిశుభ్రత విషయంలో భారతీయులు ఇటీవలి కాలంలో బాగా మెరుగయ్యారని తాజా సర్వే ఒకటి తేల్చింది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు దాదాపుగా ప్రతిరోజూ తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇతర దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులదే ముందంజ అని వెల్లడించింది. డైసన్ అనే ఓ టెక్నాలజీ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలకు చెందిన 32,282 మందిపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 1,019 మంది భారతీయులు పాల్గొన్నారు.
సర్వేలో గుర్తించిన ముఖ్యాంశాలివీ..
* కరోనా మహమ్మారి భయంతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లను తరచుగా శుభ్రం చేసుకున్నారు. 95% మంది ఇప్పటికీ అదే తీరుతో సాగుతున్నారు.
* భారత్లో 46% మంది గృహ పరిశుభ్రత విషయంలో మెరుగయ్యారు. ప్రతి ముగ్గురిలో ఇద్దరు వారానికి 5-7 సార్లు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా 40% మంది.. ఇంట్లో దుమ్ము కనిపించిన వెంటనే దాన్ని తొలగిస్తుండగా, భారత్లో అలాంటివారి శాతం దాదాపు 33%గా మాత్రమే ఉంది.
* ఇళ్లలోని ధూళి వైరస్లను కూడా కలిగి ఉంటుందన్న సంగతి 22% మంది భారతీయులకు తెలియదు.
* ఇంట్లోని దుమ్ము అంటే మట్టి, ఇసుక మాత్రమే అని భారత్లో 35% మంది భ్రమపడుతున్నారు.
* భారతీయుల్లో 54% మంది తమ పరుపులను, 72% మంది కర్టెన్లను శుభ్రం చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vikram: విక్రమ్ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్.. అందుకు నా అర్హత సరిపోదు: మహేశ్బాబు
-
Politics News
BJP: తొలిరోజు రాజకీయ, ఆర్థిక తీర్మానాలపై చర్చించిన భాజపా జాతీయ కార్యవర్గం
-
General News
TS corona: తెలంగాణలో 500 దాటిన కరోనా కేసులు
-
General News
Health Tips:అధిక రక్తపోటుతో కిడ్నీలకు ముప్పు..నివారణ ఎలాగో తెలుసా..?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Ship: రెండు ముక్కలైన నౌక.. 24 మందికిపైగా సిబ్బంది గల్లంతు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- Acharya: ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు.. రామ్చరణ్ ఆ రోల్ చేయకపోతే బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ