‘షాహీ ఈద్గా’పై విచారణ జులై 20కి వాయిదా
శ్రీకృష్ణ జన్మభూమి అంశానికి సంబంధించి కట్రా కేశవ్దేవ్ మందిరం స్థలంలోని షాహీ ఈద్గా మసీదుని తొలగించాలన్న ఓ పిటిషన్పై విచారణ జులై 20కి వాయిదా పడింది.
మథుర: శ్రీకృష్ణ జన్మభూమి అంశానికి సంబంధించి కట్రా కేశవ్దేవ్ మందిరం స్థలంలోని షాహీ ఈద్గా మసీదుని తొలగించాలన్న ఓ పిటిషన్పై విచారణ జులై 20కి వాయిదా పడింది. గోపాల్బాబా అనే భక్తుడు దాఖలు చేసిన పిటిషన్పై ఫాస్ట్ట్రాక్ కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విధులను బహిష్కరిస్తూ ఉత్తర్ప్రదేశ్ బార్ కౌన్సిల్ శుక్రవారం ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ఈ పిటిషన్పై విచారణ వాయిదా పడిందని పిటిషనర్ తరఫు న్యాయవాది దీపక్శర్మ శనివారం తెలిపారు. గతేడాది సెప్టెంబరు 20న సివిల్ జడ్జి కోర్టు (సీనియర్ డివిజన్)లో గోపాల్బాబా ఈ పిటిషన్ దాఖలు చేశారు. మథుర జిల్లా జడ్జి ఆదేశాలతో ఈ దావా.. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ అయింది. ఉత్తర్ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్బోర్డు, ఇంతెజామియా కమిటీ, షాహీఈద్గా మసీదు, శ్రీకృష్ణ జన్మభూమి సేవా సంస్థాన్, శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్లు ఇందులో ప్రతివాదులుగా ఉన్నాయి. ఇలాంటి డిమాండుతో మథురలోని వివిధ కోర్టుల్లో ఇప్పటివరకూ 11 దావాలు దాఖలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
-
TS News: త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి