తాజ్‌మహల్‌ ప్రాంగణంలో నమాజ్‌

తాజ్‌మహల్‌ ప్రాంగణంలోని షహీ మసీదులో నమాజ్‌ చేసినందుకు నలుగురు పర్యాటకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారు కాగా మరొకరు ఆజంగఢ్‌

Published : 27 May 2022 05:24 IST

ముగ్గురు హైదరాబాదీలు సహా నలుగురి అరెస్టు

ఆగ్రా: తాజ్‌మహల్‌ ప్రాంగణంలోని షహీ మసీదులో నమాజ్‌ చేసినందుకు నలుగురు పర్యాటకులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారు కాగా మరొకరు ఆజంగఢ్‌ వాసి. అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు వారిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో తాజ్‌ మహల్‌ ప్రాంగణంలో నమాజ్‌ చేయడాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని పురాతత్వ శాఖ అధికారులు చెప్పారు. అయితే వారికి ఈ విషయంపై అవగాహన లేకే నమాజ్‌ చేశారని వారితోపాటు ఉన్న టూరిస్టు గైడ్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని