ఎల్జీ ప్రమాణస్వీకారం నుంచి హర్షవర్ధన్‌ వాకౌట్‌!

కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వినయ్‌కుమార్‌ సక్సేనా ప్రమాణస్వీకార వేడుక నుంచి కేంద్ర మాజీ మంత్రి, దిల్లీలోని చాందినీ చౌక్‌ ఎంపీ హర్షవర్ధన్‌ అసహనంగా వెళ్లిపోవడం గురువారం చర్చనీయాంశంగా

Updated : 27 May 2022 05:32 IST

దిల్లీ: కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్జీ) వినయ్‌కుమార్‌ సక్సేనా ప్రమాణస్వీకార వేడుక నుంచి కేంద్ర మాజీ మంత్రి, దిల్లీలోని చాందినీ చౌక్‌ ఎంపీ హర్షవర్ధన్‌ అసహనంగా వెళ్లిపోవడం గురువారం చర్చనీయాంశంగా మారింది. రాజ్‌నివాస్‌లో ఏర్పాటుచేసిన ఈ వేడుకకు వచ్చిన హర్షవర్ధన్‌ ఓ చోట కూర్చొని ఉండగా, అది రిజర్వుడు స్థానమంటూ ఓ అధికారి ఆయన్ను లేపారు. ఆ తర్వాత పదిహేను నిమిషాలు అక్కడే వేచి ఉన్నా హర్షవర్ధన్‌కు మరో ఆసనం చూపకపోవడంతో కార్యక్రమం నుంచి ఆయన వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకొన్న మాజీ మంత్రి దిల్లీ ఎంపీగా ఉంటూ.. కొత్త ఎల్జీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనలేకపోయానని విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని