పంజాబ్లో 424 మంది ప్రముఖులకు భద్రత ఉపసంహరణ
పంజాబ్లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు తఖ్త్ల జతేదార్లు, వివిధ డేరాల అధిపతులు, పలువురు శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు సహా మొత్తం
చండీగఢ్: పంజాబ్లో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు తఖ్త్ల జతేదార్లు, వివిధ డేరాల అధిపతులు, పలువురు శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు సహా మొత్తం 424 మందికి భద్రతను ఉపసంహరించింది. ఈమేరకు పంజాబ్ పోలీసు విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అయితే భద్రతను ఉపసంహరించడం తాత్కాలికమేనని, శాంతిభద్రతలకు సంబంధించిన విధుల కోసం సిబ్బందిని ఉపసంహరిస్తున్నామని అదనపు డీజీ (భద్రత) ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. తాజా ఉత్తర్వుల మేరకు భద్రతను ఉపసంహరించిన వారిలో.. బఠిండాలోని దమ్దమా సాహిబ్ జతేదార్ జ్ఞానీ హర్ప్రీత్ సింగ్ (ఆయన ప్రఖ్యాత అకల్ తఖ్త్కు కూడా జతేదార్గా ఉన్నారు), ఆనందపుర్ సాహిబ్ జిల్లాలోని కేస్గఢ్ సాహిబ్ తఖ్త్ జతేదార్ జ్ఞానీ రఘ్బీర్ సింగ్, అమృత్సర్ స్వర్ణ దేవాలయం ప్రధాన గ్రంధి జ్ఞానీ జగ్తర్ సింగ్లు ఉన్నారు. వీరితో పాటు పలువురు డేరా అధిపతులకు; శిరోమణి అకాలీదల్, కాంగ్రెస్, ఆప్నకు చెందిన ముగ్గురు శాసనసభ్యులకు; కొందరు మాజీ ఎమ్మెల్యేలకు, వివిధ బోర్డుల ఛైర్పర్సన్లకు; పోలీసు ఉన్నతాధికారులకు కూడా భద్రతను ఉపసంహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!