ఇష్టమైన ట్రాక్టరుపై మూసేవాలా అంతిమయాత్ర
ముఠా గొడవల్లో గత ఆదివారం దుండగులు కాల్చిచంపిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (28) అంత్యక్రియలు మన్సా జిల్లాలోని స్వగ్రామం మూసాలో మంగళవారం జరిగాయి.
మన్సా (పంజాబ్): ముఠా గొడవల్లో గత ఆదివారం దుండగులు కాల్చిచంపిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (28) అంత్యక్రియలు మన్సా జిల్లాలోని స్వగ్రామం మూసాలో మంగళవారం జరిగాయి. సిద్ధూకు ఇష్టమైన ట్రాక్టరుపై అంతిమయాత్ర కొనసాగగా, వేలాది మంది అభిమానులు వెంట నడిచి కన్నీటి నివాళులు అర్పించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ముకుళిత హస్తాలతో కుమారుడి మృతదేహం పక్కన నిలుచున్నారు. అభిమానుల్లో కొందరు సిద్ధూ బొమ్మ ఉన్న టీషర్టులు ధరించారు. ఉదయం గట్టి భద్రత నడుమ ఆసుపత్రి నుంచి సిద్ధూ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. అభిమాన గాయకుణ్ని కడచూపు చూసేందుకు పంజాబ్తోపాటు రాజస్థాన్, చండీగఢ్ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో జనం తరలివచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు