ప్రియాంకాగాంధీకి కరోనా

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆమె స్వయంగా వెల్లడించారు. ‘‘కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలే

Published : 04 Jun 2022 05:53 IST

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆమె స్వయంగా వెల్లడించారు. ‘‘కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వైద్య మార్గదర్శకాల ప్రకారం.. నేను ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను’’ అని ప్రియాంక ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఇటీవల తనతో సమావేశమైన వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రస్థాయి చింతన శిబిరంలో పాల్గొనేందుకు బుధవారం లఖ్‌నవూ వచ్చిన ప్రియాంకా గాంధీ వాద్రా గురువారం దిల్లీ చేరుకున్నారు. ప్రియాంక తల్లి, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గురువారం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని